Indian Railways : రాయలసీమ ప్రజలకు గుడ్న్యూస్.. నాలుగు లైన్ల కారిడార్కు రైల్వే ఆమోదం
భారతదేశం, మార్చి 31 -- రైలు మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిస్తూ.. రేణిగుంట-గుంతకల్ రైల్వే లైన్ను సుమారు రూ.5,000 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లైన్ల కారిడార్గా విస్తరించడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. సుమారు 307.97 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ప్రాజెక్ట్. ఇటీవలి సంవత్సరాలలో రైలు రద్దీ 35 శాతానికిపైగా పెరిగింది. రాయలసీమ వ్యాప్తంగా రద్దీని తగ్గించి, ప్రయాణికుల, సరుకు రవాణాను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు వస్తోంది. ఈ మార్గంలో ప్రస్తుతం డబుల్ లైన్ నడుస్తోంది.
నాలుగు లైన్ల కారిడార్ వల్ల మరిన్ని రైళ్లు నడిచేందుకు వీలు కల్పించడం, అలాగే క్రాసింగ్లు, భారీ ట్రాఫిక్ కారణంగా కలిగే ఆలస్యాన్ని తగ్గించడం ద్వారా తిరుపతి, కడప, అన్నమయ్య, అనంతపురం వంటి జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
రేణిగుంట, రైల్వే కోడూరు, రాజంపేట, కడప, యర్రగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.