భారతదేశం, జూలై 11 -- India Vs England: క్రికెట్ ప్రపంచంలో టీమిండియా షెడ్యూల్, క్రమశిక్షణ చాలా పక్కాగా ఉంటాయి. కానీ శనివారం ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఊహించని విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. పర్యాటక భారత జట్టు మ్యాచ్ వేదికకు రావడంలో ఆలస్యం కావడంతో టాస్ వేయడం లేట్ అయింది.

ఇంగ్లాండ్ తో ఐదో టీ20 మ్యాచ్‌కు వేదికైన ఏజియాస్ బౌల్ (Ageas Bowl) గ్రౌండ్ కు సకాలంలో చేరుకోవడంలో టీమిండియా విఫలమైంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, టీమ్ బస్ తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ యూకే టూర్ టీమిండియా చరిత్రలోనే అత్యంత దారుణమైన పర్యటనల్లో ఒకటిగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది (మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది).

అంతకుముందు నెలల...