భారతదేశం, ఫిబ్రవరి 26 -- టీ20 వరల్డ్ కప్ లో చెన్నైలోని చెపాక్ స్టేడియం సాక్షిగా టీమ్ ఇండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి కోలుకున్న భారత్.. జింబాబ్వేపై సర్వశక్తులూ ఒడ్డి భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌కు అత్యధిక స్కోరు కావడం విశేషం. 72 పరుగులతో తేడాతో గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ (55) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్...