భారతదేశం, మార్చి 2 -- టీ20 ప్రపంచకప్ లో ఇండియా సెమీఫైనల్ దూసుకెళ్లింది. సూపర్ 8లో వెస్టిండీస్ పై ఘన విజయంతో నాకౌట్ బెర్త్ పట్టేసింది. ఆదివారం (మార్చి 1) రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇండియా 5 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించింది. అయితే ఇండియాపై పడి ఏడవడం అలవాటైన పాకిస్థానీలు మరోసారి తమ వక్రబుద్ధి చూపిస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ లో ఇండియా, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది. ఆ టీమ్ ఇన్నింగ్స్ లో విధ్వంసక బ్యాటర్ హెట్మయర్ వికెట్ వివాదాస్పదంగా మారింది. బుమ్రా బౌలింగ్ లో కీపర్ క్యాచ్ కోసం ఇండియా అప్పీల్ చేసింది.

అంపైర్ క్రిస్ గఫానీ ఔటిచ్చాడు. కానీ బ్యాట్ కు బాల్ తాకలేదని భావించిన హెట్మయర్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్ లో కూడా అది క్యాచ్ అని తేలింది. కానీ హెట్మయర్ మాత్రం దాన్ని నమ్మలేనట...