భారతదేశం, ఫిబ్రవరి 14 -- భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అది కేవలం టాస్‌తో మొదలయ్యేది కాదు.. మైదానంలోకి ప్లేయర్లు అడుగుపెట్టేందుకు రెండు, మూడు వారాల ముందు నుంచే మొదలయ్యే హడావుడి, ఒత్తిడి అది. ఒక సాధారణ ఓవర్‌ను కూడా అగ్నిపరీక్షగా మార్చేసే శక్తి ఈ మహా సమరానికి ఉంది. ఫిబ్రవరి 15న జరిగే టీ20 సమరంలో కూడా అసలైన యుద్ధం మిడిల్ ఓవర్లలోనే జరగనుంది. పవర్ ప్లే ముగిసి, బంతి వేగం తగ్గాక, ఇన్నింగ్స్‌ను ఎవరు కంట్రోల్ చేస్తారనేదే ఇక్కడ కీలకం.

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతున్నాడు ఉస్మాన్ తారిక్. ఇతను స్టార్ బ్యాటర్ కాదు, భారీ పేరున్న బౌలర్ అంతకన్నా కాదు. కానీ, తన విభిన్నమైన రిథమ్‌, బౌలింగ్​ శైలితో బ్యాటర్లను తికమక పెట్టే సత్తా ఉన్న ఆఫ్ స్పిన్నర్.

అంతర్జాతీయ క్రికెట్‌లో తారిక్ ఇంకా కొత్తవాడే కావొచ్చు, కానీ అతని గణాంకాలు ...