భారతదేశం, మార్చి 8 -- అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, మిచెల్ శాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్‌తో ఢీకొనబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రెండు ప్రధాన సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. అవే.. ఓపెనర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిల పేలవమైన ఫామ్.

ప్రస్తుతం టీ20 బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానాల్లో ఉన్న అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు వరల్డ్​ కప్​ లాంటి కీలక సమయంలో ఫామ్ కోల్పోవడం జట్టును కలవరపెడుతోంది. అభిషేక్ ఈ టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు వరుణ్ చక్రవర్తి సూపర్ 8...