భారతదేశం, జూలై 20 -- లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన హై-స్కోరింగ్ వన్డే మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (138) సంచలన సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

మ్యాచ్‌లో ఓడిపోయినా, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం హీరోలా నిలిచాడు! తన ఫామ్‌పై విమర్శలు గుప్పిస్తున్న వారికి, రిటైర్ అయిపోతాడంటూ వచ్చిన వార్తలకి.. తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికేస్తూ 138 పరుగుల (110 బంతులు, 17 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగాడు. అసాధ్యమనుకున్న లక్ష్యం.. రోహిత్ ఆడుతున్నంత సేపు సాధ్యమయ్యేలానే కనిపించింది. కానీ, చివరి 11 ఓవర్లలో ఓవర్లకు 11 పరుగుల చొప్పున చేయ...