భారతదేశం, మార్చి 5 -- Ind vs Eng: డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ఒక గెలుపు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్ ను 7 పరుగులతో ఓడించి ఫైనల్ చేరింది. ఈ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది సూర్య సేన. ఆదివారం (మార్చి 8) న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్లో కప్పు కోసం తలపడనుంది. 254 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ చివరికి 7 వికెట్లకు 246 రన్స్ చేసింది. 42 బంతుల్లో 89 రన్స్ చేసి సంజూ శాంసన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇంగ్లండ్ ముందు ఏకంగా 254 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా.. ఆ టీమ్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా అతడు 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 105 రన్స్ చేసి ఔటయ్యాడు. విల్ జాక్స్ 20 బ...