భారతదేశం, ఏప్రిల్ 21 -- Illu Illalu Pillalu April 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో చందును వశీకరణ తాయెత్తుతో లొంగదీసుకోవాలని భాగ్యం, ఇడ్లీ బాబాయ్, శ్రీవల్లి ప్లాన్ వేస్తారు. మరోవైపు భార్యపై సాగర్ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో చూసేయండి.

భోజనం చేద్దామని నర్మద పిలిస్తే సాగర్ వద్దంటాడు. సేటు మీద కోపం తనమీద ఎందుకు చూపిస్తున్నావని భర్తను నర్మద అడుగుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తిని రిక్వెస్ట్ చేసి, టైమ్ ఇవ్వమని అడగాలి కానీ డబ్బులు మోహం మీద కొడతావా? అని నర్మద అడుగుతుంది. ఇంట్రెస్ట్ కట్టడం ఒక్క రోజు లేట్ అయితే మీ మామయ్యకు చెప్పి పరువు తీస్తాడా? అని సాగర్ అంటాడు.

నెల రోజుల్లో రూ.20 లక్షలు కట్టమంటే ఎలా? అని నర్మద అడుగుతుంది. మా ఆఫీస్ నుంచి లోన్ ట్రై చేశా కానీ, నువ్వు డబ్బులిచ్చి జాబ్...