భారతదేశం, జూలై 26 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపార ప్రపంచాన్ని సృష్టించాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు, పరిశోధకులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన 'వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ' (డబ్ల్యూఎస్​ఏఐ) క్యాంపస్‌లో నేరుగా పాల్గొనేలా ఒక వారం రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. తమ ఏఐ ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా ఎలా మలచుకోవాలో నేర్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం.

'బిల్డింగ్ ఏ సక్సెస్‌ఫుల్ ఏఐ స్టార్టప్' పేరిట సాగే ఈ కోర్సును ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోనే నిర్వహించనున్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 27 వరకు ఆన్‌లైన్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్కెట్‌లోని అవకాశాలను ...