భారతదేశం, మే 30 -- భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్​లో రారాజుగా వెలుగుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా.. తన చరిత్రలోనే అతిపెద్ద జనరేషన్ మార్పునకు సిద్ధమవుతోంది! మూడొవ జనరేషన్​కు చెందిన ఈ సరికొత్త క్రెటా టెస్ట్ మోడల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ రోడ్లపై ప్రస్తుత క్రెటాతో కలిసి నడుస్తూ తొలిసారి కెమెరాకు చిక్కింది. కంపెనీ దీనిని సరికొత్త కే3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తోంది. దీనివల్ల కారు సైజ్ పెరగడమే కాకుండా.. ఫ్యూచరిస్టిక్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్లకు ఇది సపోర్ట్ చేయనుంది. ఈ మోడల్ 2026 చివరి నాటికి గ్లోబల్ మార్కెట్​లో ఎంట్రీ ఇచ్చి, 2027 ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే సరికొత్త క్రెటా లుక్, స్పేస్, టెక్నాలజీ పరంగా పూర్తిగా మారిపోనుంది. అంతర్జాతీయ మార్కెట్​లో 'హ్యు...