భారతదేశం, మార్చి 28 -- హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పోర్ట్​ఫోలియోని భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రణాళికలో 'హైబ్రిడ్ ఎస్‌యూవీలు' కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే కొన్నేళ్లలో కంపెనీ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన బహుళ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది.

ఎలక్ట్రిక్ వాహనాలతో (ఈవీ) పాటు హ్యుందాయ్ ఇప్పుడు మూడు కొత్త ఎస్‌యూవీలతో భారతదేశంలో హైబ్రిడ్ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. వీటిలో నెక్ట్స్​-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా, ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ, ప్రీమియం హ్యుందాయ్ పాలిసేడ్ ఉన్నాయి.

తదుపరి తరం క్రెటా ఇప్పటికే పరీక్షల దశలో ఉంది. ఇది 2027 ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ మరింత బోల్డ్, బాక్సీ లుక్‌తో పూర్తిగా సరికొత్త డిజైన్‌ను పొందే అవకాశం ఉంది. ఇది కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన, ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ...