భారతదేశం, జనవరి 8 -- హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై నగర పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జానర్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు.

ఆహార క‌ల్తీని నిరోధించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సీపీ సజ్జనార్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే 'హత్యాయత్నం'గానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. కేవలం రోడ్డు పక్కన...