భారతదేశం, జూన్ 26 -- అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత రియల్ ఎస్టేట్ రంగం మాత్రం తగ్గేదేలేదంటూ దూసుకెళుతోంది! దేశంలోని టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే క్యూ2 2026లో ఏకంగా 19 శాతం పెరిగాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'ప్రాప్‌ఈక్విటీ' విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో 94,864 ఇళ్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,12,458 యూనిట్లకు చేరింది. ముఖ్యంగా నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపించలేదు! పైగా గత కొన్ని త్రైమాసికాలతో పోలిస్తే కొత్త ఇళ్ల సరఫరా (న్యూ లాంచెస్) 43 శాతం పెరిగి, 1,17,609 యూనిట్లకు చేరుకోవడం మార్కెట్ జోష్‌ను పెంచింది. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా.....