భారతదేశం, జూన్ 4 -- Honda 0 alpha ev India launch : ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా.. భారత ఆటోమొబైల్ మార్కెట్​లో మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవడానికి భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ మార్కెట్​లోకి ఏకంగా 10 కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఈ జూన్ (2026) లోనే ప్రీమియం హైబ్రిడ్ ఎస్‌యూవీ 'హోండా జెడ్ఆర్-వీ'ని లాంచ్ చేయబోతోంది. అంతేకాదు ఇంకొన్ని నెలల్లో ఈ హోండా నుంచి ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లాంచ్​కాబోతోంది. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

భారత్‌లో హోండా బ్రాండ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇదే. ఈ కారును విదేశాల నుంచి నేరుగా సీబీయూ రూపంలో, పరిమిత సంఖ్యలో ఇండియాకు దిగుమతి చేయనున్నారు. ఈ మోడల్​ని సంస్థ ఇప్పటికే ప్రదర్శించింది.

ధర, పోటీ: మార్కెట్​లో దీని...