భారతదేశం, మార్చి 23 -- టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ తెలుగు కామెడీ సినిమా 'హే బల్వంత్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. గోపీ అచ్చెర డైరెక్ట్ చేసిన ఈ కామెడీ డ్రామా మార్చి 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం ఇందులో సుహాస్ సరసన హీరోయిన్‌గా నటించింది.

ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలోకి వచ్చిన మూవీ హే బల్వంత్. రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీకి వస్తోంది. ఒక తండ్రీకొడుకుల బంధం చుట్టూ తిరిగే ఈ సినిమా.. వచ్చే మంగళవారం అంటే మార్చి 31 నుంచి జీ5 లో ఒరిజినల్ తెలుగు భాషలో అందుబాటులో ఉండబోతోంది.

సుహాస్ హీరోగా చేసిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు మిక్స్‌డ్ రివ్యూలు తెచ్చుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా కొంచెం డల్‌గానే వచ్చాయి....