భారతదేశం, మార్చి 27 -- ఓటీటీలోకి తెలుగు కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. సుహాస్ హీరోగా వచ్చిన 'హే బ‌ల్‌వంత్‌' మూవీ రీసెంట్ గా థియేటర్లో నవ్వులు పంచింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. హే బ‌ల్‌వంత్‌ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.

ఓ వైపు కామెడీ పండిస్తూనే, మరోవైపు మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ సాగిపోతున్నాడు యువ హీరో సుహాస్. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ లేటెస్ట్ మూవీ 'హే బ‌ల్‌వంత్‌'. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 31, 2026 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

హే బ‌ల్‌వంత్‌ మూవీ ఓటీటీ రిలీజ్ పై శుక్రవారం (మార్చి 27) అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మార్చి 31 నుంచి ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జీ5 తెలుగు ప్రకటించింది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ...