భారతదేశం, జూలై 12 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇక డిన్నర్ ముగియగానే నేరుగా వెళ్లి సోఫాలో కూర్చోవడమో, టీవీ చూస్తూనో లేదా మొబైల్ స్క్రోల్ చేస్తూనో గడిపేస్తుంటారు. కొందరైతే తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత చేసే ఒకే ఒక్క చిన్న పని మీ ఆరోగ్యాన్ని సమూలంగా మార్చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, గంటల కొద్దీ సమయం కేటాయించాల్సిన పనీ లేదు. కేవలం పది నిమిషాల పాటు నడిస్తే చాలు.

భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఐయిమ్స్​తో పాటు హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సే...