భారతదేశం, ఏప్రిల్ 3 -- పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్నంలోని ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్‌ టర్న్‌లను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం విమ్స్ ఆసుపత్రి నుండి విశాఖ వ్యాలీ స్కూల్ జంక్షన్ మీదుగా హనుమంతవాక జంక్షన్ వరకు ఉన్న తూర్పు జోన్ మార్గాన్ని తనిఖీ చేశారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జాతీయ రహదారిపై, ముఖ్యంగా హనుమంతవాక, విశాఖ వ్యాలీ జంక్షన్ మధ్య తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని చెప్పారు.

వాహన, పాదచారుల రాకపోకలను మెరుగుపరచడానికి ఫ్రీ లెఫ్ట్ టర్న్‌లను ప్రవేశపెట్టాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఈ ప్రతిపాదనపై జీవీఎంసీ అధికారులు వెంటనే చర్యలు మెుదలుపెట్టారు. ఆదర్శ్ నగర్ ఓల్డ్ డెయిరీ ఫామ్ జంక్షన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ టర్న్‌ల కోస...