భారతదేశం, జూలై 31 -- ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటి ప్రవాహంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. శుక్రవారం (జూలై 31) ఉదయం 10.14 గంటల ప్రాంతంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఫ్లడ్ మాన్యువల్ నిబంధనల ప్రకారం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్తగూడెంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు.

వరద పరిస్థితులు, సహాయం కోసం ప్రజలు అధికారులను సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నంబర్: 08744241950, వాట్సాప్ నంబర్: 9392919743 అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో, గ...