భారతదేశం, మార్చి 13 -- cw ఆస్తి పన్నుదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తాజా ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన పెండింగ్‌ బకాయిలను మార్చి 31వ తేదీలోపు క్లియర్ చేస్తే రాయితీ ఇవ్వనుంది. వడ్డీపై 90 శాతం రాయితీ(డిస్కౌంట్) ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆస్తిపన్ను చెల్లింపుదారులు జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ghmc.gov.in ద్వారా లేదా MyGHMC , MyCURE వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాలు , సిటిజన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి కూడా బకాయిలు చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని పొందవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

చాలా మంది ఆస్తి పన్నులను క్లియర్ చేయకుండా ఉంటారు. ఇది కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి. చాలా డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి దారితీస్తుంద...