భారతదేశం, జూన్ 4 -- దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్.. పర్యావరణ అనుకూల సాంకేతికతతో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. తన అత్యధిక విక్రయాలు సాధించే స్ల్పెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్లలో 'ఫ్లెక్స్-ఫ్యూయల్' వేరియంట్లను మార్కెట్​లోకి విడుదల చేసింది. జిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం స్ల్పెండర్+ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధర రూ. 82,710 కాగా, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధర రూ. 72,792 గా ఉంది. ఇవి పెట్రోల్‌తో పాటు ఇథనాల్ ఇంధనంతోనూ నడుస్తాయి. జులై నుంచి దిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అనంతరం దేశవ్యాప్తంగా సేల్స్​ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సాధారణంగా కంపెనీలు ఏదైనా కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేటప్పుడు ఎక్కువ ధర ఉండే ప్రీమియం బైక్​లను ఎంచుకుంటాయి. కానీ హీరో మోటోకార్ప్ ఇందుకు భిన్నంగా, స...