భారతదేశం, మే 27 -- FIFA World Cup: అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 48 జట్లు తలపడుతున్న ఈ మహా సమరంలో అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) నడుం బిగించింది. ముఖ్యంగా మ్యాచ్‌ ముగిసే సమయంలో కావాలనే సమయాన్ని వృథా చేసే జట్ల వ్యూహాలకు ఈసారి గట్టి బ్రేక్ పడనుంది.

మైదానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు నెమ్మదిగా నడవడం, గాయాల పేరుతో వ్యూహాత్మకంగా మ్యాచ్‌ను ఆలస్యం చేయడం వంటి చర్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుట్‌బాల్ నియమ నిబంధనలను రూపొందించే ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్ (IFAB)తో కలిసి ఫిఫా కొన్ని కీలక మార్పులను తీసుకొచ్చింది.

గతంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని టోర్న...