భారతదేశం, జూలై 4 -- చిన్న పిల్లలు అకారణంగా ఏడుస్తున్నా, ఇంట్లో పనులు వరుసగా ఆగిపోతున్నా, లేదా ఎవరైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనా.. పెద్దలు వెంటనే "దిష్టి తగిలింది" అంటుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకం. దిష్టిని తొలగించడానికి ఉప్పు, ఆవాలు, ఎండుమిర్చి వాడటం మన సంప్రదాయం. అయితే, దిష్టి తీసేటప్పుడు ఏ మంత్రాలు చదవాలి? సరైన పద్ధతి ఏమిటి? అనే విషయాలపై చాలామందికి స్పష్టత ఉండదు.

దిష్టి తీసేటప్పుడు మనసులో భక్తి, నమ్మకం ఉంటే ఫలితం త్వరగా ఉంటుందని పెద్దల మాట. ఆ సమయంలో ఈ కింది మంత్రాలను చదవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి:

హనుమంతుని మంత్రం: అంజనీ పుత్రుడైన హనుమంతుడిని స్మరిస్తే భయం, దిష్టి దోషాలు పటాపంచలవుతాయి. "ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్" అనే మంత్రాన్ని జపించండి. ఒకవేళ ఇది కష్టమనిపిస్తే, "సంకట కటె మిటె సబ పీరా, జో సుమిరై హనుమత బల...