భారతదేశం, మార్చి 28 -- భారత ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇప్పటికే 'మేడ్ ఇన్ ఇండియా' వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లతో వేగంగా దూసుకెళుతున్న వియత్నాం ఆటో దిగ్గజం విన్‌ఫాస్ట్.. ఇప్పుడు మార్కెట్​లోని ఇతర విభాగాలపై కన్నేసింది! ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలోనే వెల్లడించిన సంస్థ, ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. వియత్నాం మార్కెట్​లో విక్రయిస్తున్న మూడు ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం.

విన్‌ఫాస్ట్ నుంచి తొలుత ఇవో, ఫెలిజ్, వైపర్ ఎలక్ట్రిక్​ స్కూటర్లు భారత్‌లోకి రానున్నాయని కంపెనీ ధృవీకరించింది. ఈ మూడు స్కూటర్లు కూడా ఎల్​ఎఫ్​పీ బ్యాటరీలను, హబ్-మౌంటె...