భారతదేశం, సెప్టెంబర్ 3 -- దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగం వేగంగా పుంజుకుంటోంది. పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య కుటుంబాలు ఈవీల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'సింపుల్ ఎనర్జీ'.. కుటుంబ అవసరాలను లక్ష్యంగా చేసుకుని తమ నూతన ఈ-స్కూటర్ 'సింపుల్ వేవ్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ వన్ ఎస్, అల్ట్రా మోడళ్ల సరసన ఈ కొత్త స్కూటర్ చేరింది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి అవసరాలకు తగినట్లుగా దీనిని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ కొత్త ఎలక్టిరిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

సముద్రంలో ఈదే ...