భారతదేశం, మార్చి 14 -- ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ విండ్సర్ ప్రో'పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అంతే కాదు పబ్లిక్​ ఛార్జింగ్​ ఫెసిలిటీని కూడా ఉచితంగా ఇస్తోంది! విలాసవంతమైన ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో వచ్చిన ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.

కొత్త విండ్సర్ ప్రో కొనుగోలుదారులకు కంపెనీ ఒక ఏడాది పాటు ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పొందాలంటే కారు బిల్లింగ్ ప్రక్రియ మార్చి 15వ తేదీలోపు పూర్తి కావాలి.

దీనితో పాటు కస్టమర్లకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కూడా ఎంజీ మోటార్ అందిస్తోంది:

ప్రత్యేక ప్రయోజనాలు: రూ. 40,000 వరకు అదనపు బెనిఫిట్స్.

డిప్రిసియేషన్ బెనిఫిట్స్: ఏకంగా రూ. 13.17 లక్షల వరకు డిప్రిసియేషన్ బెనిఫిట్స్​ పొందే...