భారతదేశం, జూలై 6 -- భారత ఆటోమొబైల్ రంగంలోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా' వాహనదారులకు షాకిచ్చింది. తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ మోడల్ అయిన 'విండ్సర్ ఈవీ' ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకుల వ్యయం, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే కియా, టయోటా వంటి ప్రముఖ సంస్థలు తమ కార్ల ధరలను సవరించగా, ఇప్పుడు ఈ లిస్ట్​లోకి ఎంజీ కూడా చేరింది.

ఎంజీ విండ్సర్ ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుండగా, అన్ని వేరియంట్లపైనా ధరల పెంపు ప్రభావం పడింది. విశేషం ఏంటంటే, ఈ కారు బేస్ మోడల్ అయిన 'ఎక్సైట్' వేరియంట్‌పైనే కంపెనీ గరిష్టంగా రూ. 60,000 పెంచేసింది.

కారు మోడళ్లను బట్టి ధరల పెంపు వివరాలు శాతాల్లో చూస్...