భారతదేశం, జూలై 6 -- భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్) ఇంధనాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే, ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడటం వల్ల కార్ల ఇంజన్లు పాడైపోతాయా? మైలేజ్ తగ్గిపోతుందా? అనే ఆందోళనలు సోషల్ మీడియా వేదికగా వాహనదారుల్లో విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' కస్టమర్ల సందేహాలను నివృత్తి చేస్తూ అధికారికంగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

సోషల్ మీడియాలో ఒక కస్టమర్ అడిగిన ప్రశ్నకు మహీంద్రా కస్టమర్ కేర్ విభాగం స్పందిస్తూ తమ ఇంజన్ల సామర్థ్యంపై పూర్తి భరోసానిచ్చింది.

"మహీంద్రా పెట్రోల్ ఇంజన్లను ప్రస్తుత ఇంధన ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందించడం జరిగింది...