భారతదేశం, ఏప్రిల్ 29 -- Drishyam 3 Teaser: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సంచలన థ్రిల్లర్ 'దృశ్యం 3' టీజర్ విడుదలైంది. గతాన్ని వెంటాడుతున్న నీడల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జి కుట్టి చేసే పోరాటం ఈసారి మరింత ఉత్కంఠగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

దక్షిణాది సినిమా రారాజు మోహన్ లాల్ నటించిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో 'దృశ్యం' ఒకటి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మూడో భాగం దృశ్యం 3 కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

మే 21న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. కేవలం మలయాళంలోనే కాకుండా, భారతీయ సినిమా రంగంలోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిన ఈ కథ, ఈసారి ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

విడుదలైన టీజర్ గమనిస్తే మొదటి...