భారతదేశం, మే 21 -- Drishyam 3 Review: బ్లాక్‌బస్టర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి వచ్చిన మూడో పార్ట్ గురువారం (మే 21) థియేటర్లలో రిలీజైంది. ఈసారి రీమేక్ కాకుండా మలయాళం డబ్బింగ్ వెర్షన్ తెలుగులోకీ వచ్చింది. అయితే గతంలో వచ్చిన రెండు సినిమాలతో పోలిస్తే ఈ దృశ్యం 3 అంతగా థ్రిల్ పంచడంలో విఫలమైందనే చెప్పాలి.

గతంలో జరిగిన ఐజీ కొడుకు వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని సేఫ్‌గా కాపాడుకున్న జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) ఇప్పుడు సమాజంలో ఒక సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఆయన నిర్మించిన 'దృశ్యం' సినిమా భారీ హిట్ సాధిస్తుంది. భార్య రాణి (మీనా), పెద్ద కూతురు అంజు (అన్సిబా), చిన్న కూతురు అను (ఎస్తేర్ అనిల్)లతో కలిసి ఆయన ఒక లగ్జరీ జీవితాన్ని గడుపుతుంటాడు.

గత చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, పెద్ద కూతురు అంజుకు త్వరగా పెళ్లి చేసి సెటిల్ చేయాలనేది జార్జ్‌కుట్టి ఆశయం. అ...