భారతదేశం, మే 28 -- Drishyam 3 OTT: మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం'. ఇప్పుడీ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రం 'దృశ్యం 3' (Drishyam 3) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ 'జార్జ్‌కుట్టి'గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

మోహన్ లాల్, మీనా తదితరులు నటించిన 'దృశ్యం 3' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. ఈ చిత్రానికి ప్రైమ్ వీడియో అధికారిక డిజిటల్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

దృశ్యం 3 చిత్ర బృందం ఓటీటీ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ వి...