భారతదేశం, మే 20 -- Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలో థ్రిల్లర్ జోనర్ రూపురేఖలను మార్చేసి, సరికొత్త రికార్డులు సృష్టించిన మూవీ 'దృశ్యం'. మోహన్‌లాల్ 'జార్జ్‌కుట్టి'గా నటించిన ఈ చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ నుంచి మోస్ట్ అవేటెడ్ 'దృశ్యం 3' (Drishyam 3) మే 21న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 'ఆశీర్వాద్ సినిమాస్' నిర్వహించిన ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. మొదటి భాగం స్క్రిప్ట్ విషయంలో తాను అనుకున్నదానికి, ప్రేక్షకుల రియాక్షన్‌కు మధ్య జరిగిన ఒక పొరపాటును పంచుకున్నారు.

ఈ సినిమా ఐడియా తనకు ఎలా వచ్చిందనేది జీతూ జోసెఫ్ వివరించారు. 2000 సంవత్సరంలో ఆయన సినీ పరిశ్రమలోకి రాకముందు రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక యదార్థ ఘర్షణ ఆధారంగా ఈ కథ పుట్టింది.

"ఒక అబ్బాయి, అమ్...