భారతదేశం, మార్చి 12 -- బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. అతడు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్' (Dhurandhar) మూవీ.. దాని సీక్వెల్ విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తిరిగి వస్తోంది. "తుఫానుకు ముందు ఆంధీ (పెను తుఫాను) వస్తోంది" అంటూ రణవీర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

'ధురంధర్' సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న విడుదల కానుంది. దానికి వారం రోజుల ముందుగానే మొదటి భాగాన్ని భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మార్చి 12 నుండి సుమారు 250 థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా మార్చి 13 నుండి మరో 250 స్క్రీన్లలో ఈ మూవీ అలరించనుంది. మొత్తం 1000కి పైగా స్క్రీన్లలో రోజుకు 1250కి పైగా షోలతో ఇది అతిపెద్ద రీ-రిలీజ్ గా నిలవనుంది...