భారతదేశం, మార్చి 5 -- ధురంధర్ 2 సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఫస్ట్ పార్ట్ ధురంధర్ పై ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ధురంధర్ ఫస్ట్ పార్ట్ ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా ధురంధర్ మరో హిస్టరీ క్రియేట్ చేసింది.

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ జనవరి 30న ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టింది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి 31 రోజుల్లో ఈ సినిమాకు 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయని ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ వెబ్ సైట్ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా నిలిచిందని వెల్లడించింది.

ఓటీటీలో వచ్చినప్పటి నుంచి ధురంధర్ మేనియా కొనసాగుతూనే ఉంది. మార్చి 3కు ముందు వరకు ఆ సినిమా 5 వారాలుగ...