భారతదేశం, మార్చి 22 -- రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నెక్స్ట్ గెలేరియా మాల్‌లోని పీవీఆర్ (PVR) మల్టీప్లెక్స్‌లో సినిమా ప్రదర్శన సమయంలో పెద్ద గొడవ జరిగింది. ఒకే షోకి హిందీ, తెలుగు వెర్షన్లకు టిక్కెట్లు అమ్మడమే ఈ వివాదానికి కారణమైంది.

సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో వేర్వేరు భాషలకు వేర్వేరు స్క్రీన్‌లు ఉంటాయి. కానీ ఇక్కడ బుక్‌మైషో యాప్‌లో పొరపాటున ఒకే స్క్రీన్‌పై తెలుగు, హిందీ వెర్షన్లకు ధురంధర్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఏ భాషలో సినిమా ప్లే చేయాలనే దానిపై ప్రేక్షకులు ఒకరితో ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు.

సినిమా స్టార్ట్ కావడానికి ముందు కాక్ టైల్ 2 మూవీ ట్రైలర్ ప్రోమో ప్లే అవుతున్న సమయంలోనే ఈ గొడవ మొదలైంది. "మేము తెలుగు వెర్షన్ ...