భారతదేశం, మార్చి 20 -- రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా కంగనా రనౌత్ సినిమాను విమర్శించాడు. ధురంధర్ 2 సినిమాను 'ప్రచారం' (Propaganda) అని విమర్శిస్తున్న వారికి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు.

రాకేష్ బేడీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను రాజకీయాలను నమ్మను, సినిమాను మాత్రమే నమ్ముతాను. ఒక చిత్రాన్ని ఇష్టపడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక వర్గానికి లేదా రాజకీయ పార్టీకి ఆపాదించడం సరైనది కాదు. ప్రజలు ఈ సినిమా (ధురంధర్ 2)ను ప్రేమిస్తున్నారంటేనే ఇది ఎంత గొప్పదో అర్థమవుతోంది" అని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమాను ఉద్దే...