భారతదేశం, మార్చి 5 -- ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ వైట్-బాల్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అతడు గురువారం (మార్చి 5) ముంబైలో జరిగిన అర్జున్ టెండూల్కర్ - సానియా చందోక్ వివాహ వేడుకలో మెరిశాడు. తన భార్య సాక్షితో కలిసి వేదిక వద్దకు చేరుకున్న ధోనీ.. ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ ఫోజులిచ్చాడు. సాక్షి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ధోనీ మరికొంత సమయం పాపరాజీల కోసం వేచి ఉండి, వారందరినీ పలకరించడం విశేషం. అయితే అతని చేతుల్లో ఉన్న మొబైల్ పైనే అందరి కళ్లూ పడ్డాయి.

ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ధోనీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం. ధోనీకి ఫోన్లంటే పెద్దగా ఇష్టం ఉండదని, కనీసం మెసేజ్‌లకు కూడా స్పందించరని అతని మాజీ సహచరులు చాలా సందర్భాల్లో చెప్పారు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా గతంలో ధోనీ ఫోన్ వాడకం గురించి చెబుతూ.. "ధోనీ తన ఫోన్‌ను హ...