భారతదేశం, మార్చి 28 -- ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే పిడుగులాంటి వార్త ఇది. ఆ జట్టు గుండెకాయ లాంటి ఎంఎస్ ధోనికి గాయమైంది. దీంతో ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్‌లకు అతను టీమ్ కు అందుబాటులో ఉండడని సీఎస్కే ఫ్రాంఛైజీ శనివారం (మార్చి 28) అనౌన్స్ చేసింది.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం పిక్క కండరాల నొప్పితో (calf strain) తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన స్పెషల్ రిహాబిలిటేషన్‌లో ఉన్నారని, మైదానంలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదని సీఎస్కే తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

గ్వాలియర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు కేవలం రెండు రోజుల ముందే ధోని గాయం అప్‌డేట్ రావడం గమనార్హం. ధోని ఆడటం దాదాపు అసాధ్యం కావడంతో, ఆయన స్థానంల...