భారతదేశం, జూలై 30 -- Dhanush: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, పాన్-ఇండియా స్టార్ ధనుష్ (Dhanush)పై మరోసారి తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. తన 43వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చెన్నైలో అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకునే క్రమంలో ధనుష్ మాట్లాడిన "పేదరికపు" మాటలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

జూలై 28న ధనుష్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో అభిమానులు భారీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ.. "జూలై 28 అనేది కేవలం ఒక సాధారణ తేదీ, ఒక సంఖ్య మాత్రమే. చిన్నప్పుడు స్కూల్లో నా తోటి పిల్లలు కలర్‌ఫుల్ డ్రెస్‌లు వేసుకుని చాక్లెట్లు పంచుతుంటే నాకు చాలా ప్రత్యేకంగా అనిపించేది.

నిజానికి నాకు 4వ తరగతి వ...