భారతదేశం, ఏప్రిల్ 24 -- Kailash hills murder case : దేశ రాజధానిలోని కైలాష్ హిల్స్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ఒక 22 ఏళ్ల యూపీఎస్సీ ఆస్పిరెంట్‌పై మాజీ ఇంటి పనివాడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశాడు. దొంగతనం చేసే క్రమంలో లాకర్‌ను తెరిచేందుకు ఆమె వేలిముద్రలను వాడేందుకు ప్రయత్నించడం ఈ కేసులో వెలుగుచూసిన అత్యంత భయంకరమైన నిజం!

దక్షిణ ఢిల్లీలోని విలాసవంతమైన ప్రాంతంలో జరిగిన ఈ హత్యోదంతం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం డబ్బు కోసం ఒక ఉన్మాదిలా ప్రవర్తించిన నిందితుడు రాహుల్ మీనా, ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్​ని, కాబోయే సివిల్ సర్వెంట్‌ను పొట్టనబెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కేసులో వెలుగుచూసిన నిజాలను చదివితే సభ్య సమాజం తలదించుకుంటోంది.

23 ఏళ్ల రాహుల్ మీనా ఆ ఇంట్లో పనివాడిగా చేసేవాడు. అందుకే ఆ కుటుంబం గురించి బాగా తెలుసు...