భారతదేశం, జూన్ 28 -- దీపాన్ని లక్ష్మీదేవికి, దైవ స్వరూపంగా భావిస్తారు. దీపం వెలిగించినప్పుడు ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. నెయ్యి లేదా నూనెతో వెలిగించే దీపానికి దైవానుగ్రహాన్ని పొందే శక్తి ఉంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కుటుంబంలో ఆనందం స్థిరంగా ఉంటుంది.

శాస్త్రం ప్రకారం, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం ఉత్తమం. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు, అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 5:30 నుంచి 7:30 గంటల మధ్య (ప్రదోష కాలంలో) దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. సమయపాలన పాటించడం ద్వారా పూజకు పూర్తి ఫలితం లభిస్తుంది.

దీపారాధన కోసం మట్టి, ఇత్తడి లేదా రాగి పాత్రలను ఉపయోగించవచ్చు. మట్టి ప్రమిదలను వాడేటప్పుడు...