భారతదేశం, ఏప్రిల్ 9 -- ఐపీఎల్ 2026.. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఛేజింగ్ లో లాస్ట్ ఓవర్.. ఢిల్లీ 13 రన్స్ చేస్తే గెలుస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే నిగమ్ ఫోర్ కొట్టాడు. ఆ వెంటనే నిగమ్ ఔటైనా.. అప్పటికే జోరు మీదున్న మిల్లర్ సిక్సర్ బాదేశాడు. లాస్ట్ బాల్ కు 2 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయాన్ని అందుకుంది.

ఐపీఎల్ 2026లో ఫ్యాన్స్ కు కావాల్సిన అసలైన మజా ఇదే కదా. ఉత్కంఠతో ఊపేసిన పోరులో బుధవారం (ఏప్రిల్ 8) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఒక్క రన్ తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఢిల్లీ 8 వికెట్లకు 209 రన్స్ చేయగలిగింది. ...