భారతదేశం, జూన్ 15 -- అమెరికా- ఇరాన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అష్టకష్టాలు పడుతున్న ప్రపంచ దేశాల ప్రజలకు భారీ రిలీఫ్! ఇరాన్​తో శాంతి ఒప్పందం కుదిరిందని, ఫలితంగా చమురు సరఫరాకు జీవనాధారమైన హర్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంతకాలంగా భారీగా పెరిగిపోయిన చమురు ధరలు ఇప్పుడు పతనమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం క్షీణించి బ్యారెల్‌కు 84 డాలర్లకు చేరుకోగా, యూఎస్ క్రూడ్ ధర 4.8 శాతం పతనమై 81 డాలర్ల వద్దకు పడిపోయింది.

అమెరికా- ఇరాన్ మధ్య ఫిబ్రవరి చివరి నుంచి జరుగుతున్న యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూతపడటం, ఫలితంగా చమురు ధర ఒకానొక దశలో బ్యారెల్​కి 120 డాలర్ల ఎగువకు చేరడం తెలిసిన విషయమే.

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో అత్యధిక భాగం ఈ హార్ము...