భారతదేశం, జూలై 16 -- దేశ రాజధాని దిల్లీలో హిట్ అండ్ రన్ కేసు కలకలం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు.. రహదారిపై విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌ను బలితీసుకుంది. ఆ సమయంలో సదరు పోలీసు.. స్పీడ్ మానిటరింగ్ డివైజ్​ని ఇన్​స్టాల్ చేస్తుండటం గమనార్హం.

బుధవారం సాయంత్రం ఔటర్ నార్త్ దిల్లీలోని సింఘు బోర్డర్ సమీపంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు సదరు కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల కథనం ప్రకారం.. దిల్లీ ట్రాఫిక్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అమిత్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సింఘు బోర్డర్ వద్ద ఉన్న ఒక ట్రాఫిక్ బూత్ సమీపంలో డ్యూటీలో ఉన్నారు. వాహనాల వేగాన్ని రికార్డ్ చేసే ఆన్-డ్యూటీ స్పీడ్ మానిటరింగ్ మిషన్‌ను ఆయన రోడ్డు పక్కన ఇన్​స్టాల్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంల...