భారతదేశం, ఏప్రిల్ 22 -- Anjanapura Murder Case : దేశంలో నేరాలు రోజురోజుకు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని సంఘటనలు చూస్తుంటే.. "చంపడంలో పీహెచ్​డీ చేశారా?" అన్నట్టు కనిపిస్తోంది. బెంగళూరులో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేరణ అనే మహిళ తన ప్రియుడు తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో అత్యంత క్రూరంగా వ్యవహరించింది. సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి, బాయ్​ఫ్రెండ్​ని కుర్చూకి కట్టేసి, అతనిపై ఫ్లేమెబుల్​ లిక్విడ్​ పోసి, మంట పెట్టి కాల్చేసింది. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా కనికరం లేకుండా వీడియో తీస్తూ రాక్షసానందం పొందింది!

బెంగళూరులోని ఒక టెలికాం స్టోర్‌లో ప్రేరణ(27), కిరణ్(27) సహోద్యోగులుగా పనిచేసేవారు. ఏడాదిన్నరగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. అయితే, గత కొన్ని రోజులుగా కిరణ్ తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, పెళ...