భారతదేశం, ఏప్రిల్ 5 -- దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే దాడులు, హత్యల వరకు వెళుతున్నారు! దిల్లీలో తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈశాన్య దిల్లీలోని దయాల్‌పూర్ పరిధిలో కేవలం రూ. 400 గురించి మొదలైన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. 26 ఏళ్ల మహమ్మద్ కైఫ్ అనే యువకుడిని ముగ్గురు మైనర్లు కలిసి కిరాతకంగా హత్య చేశారు.

న్యూ ముస్తఫాబాద్‌కు చెందిన మహమ్మద్ కైఫ్, స్థానికంగా ఉండే ముగ్గురు మైనర్ల (సుమారు 16 ఏళ్ల వయస్సు) వద్ద రూ. 400 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చే విషయంలో గత కొంతకాలంగా వీరి మధ్య గొడవ జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో 25 ఫీట్ల రోడ్డులోని ఒక షాపు వద్ద కైఫ్ ఒంటరిగా ఉన్న సమయం చూసి, ఆ ముగ్గురు అతనిపై దాడి చేశారు.

ఈ దారుణ హత్యను నిందితులు అత్యంత పైశాచికంగా చిత...