భారతదేశం, జూలై 28 -- నీట్​ యూజీ పేపర్​ లీక్​పై పోరాటంలో భాగంగా జులై 20న కాక్రోచ్​ జనతా పార్టీ నిర్వహించిన 'చలో సంసద్' నిరసనల్లో దిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై భారత అత్యున్నత నాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చ్‌లో శాంతిభద్రతల పేరుతో పోలీసులు పరిమితి దాటి ప్రవర్తించడంపై సుప్రీంకోర్టు మంగళవారం కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, హద్దులు దాటి ప్రవర్తించినా సరే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది.

నాటి నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు లాఠీలు, టియర్​ గాస్​తో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

పోలీసుల దౌర్జన్యంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.

"ఈ ఘటనపై పూర్తిగా స్వతంత్ర దర్యాప్తు జరగాలి. హద్దులు దాటి ప్రవర్తించిన వారు...