భారతదేశం, జూన్ 17 -- Christopher Nolan Mumbai Visit: హాలీవుడ్ సినిమా ప్రమోషన్ల హిస్టరీలోనే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్. లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో వస్తున్న సరికొత్త విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) గ్లోబల్ ప్రమోషన్ టూర్‌లో భాగంగా భారతదేశంలో గ్రాండ్‌గా ప్రీమియర్ షో జరుపుకోనుంది. లండన్, పారిస్, న్యూయార్క్ లాంటి టాప్ సిటీస్ సరసన ముంబైని అఫీషియల్ గ్లోబల్ టూర్ స్టాప్‌గా యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రకటించింది.

ముంబైలోని 'పీవీఆర్ ఐకాన్ ఐమాక్స్: ఫీనిక్స్ పల్లాడియం' వేదికగా జరగనున్న ఈ చారిత్రాత్మక ఈవెంట్‌లో పాల్గొనడానికి క్రిస్టోఫర్ నోలన్‌ ఇండియాకు రానున్నారు. ఆయనతో పాటు హాలీవుడ్ సూపర్ స్టార్స్ మాట్ డామన్, టామ్ హాలండ్, ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ కూడా భారత్‌కు వస్తున్నారు....