భారతదేశం, మార్చి 16 -- ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తుకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం 'జ్ఞానపీఠ్' (Jnanpith Award) దక్కడం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. అకిలన్ (1975), జయకాంతన్ (2002) తర్వాత ఈ గౌరవం పొందిన మూడవ తమిళ రచయితగా వైరముత్తు నిలిచాడు. అయితే ఆయనను అభినందిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన సోషల్ మీడియా పోస్టులపై సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సదరు హీరోల అభిమానుల నుండి ఆమెకు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదురవ్వగా, చిన్మయి వారికి అంతే దీటుగా సమాధానమిచ్చింది.

మీటూ (MeToo) ఉద్యమ సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళల్లో చిన్మయి ఒకరు. వైరముత్తును కమల్, రజనీలు అభినందించడంపై స్పందిస్తూ చిన్మయి ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసింది.

"నేను కూడా రజ...